Tuesday, September 13, 2022

బిజెపి తెరాస కుమ్మక్కై తీసుకొచ్చిన ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని కుని చేయడమే - పాల్వాయి స్రవంతి రెడ్డి

  


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి... అనంతరం చాకలి ఐలమ్మ, అంబేద్కర్, బొమ్మగాని ధర్మ బిక్షం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి స్థానికులతో మాట మంతి జరిపి తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చౌటుప్పల్ కి విచ్చేశానని మునుగోడు ఆరాధ్య దైవమైన ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చరిత్రలో మునుగోడులో ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గెలిచేదని కేవలం 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర పై మమకారంతో టిఆర్ఎస్ ని గెలిపించారని అన్నారు. బిజెపి తెరాస ఆర్థిక బలం, అధికార బలంతో విర్రవీగుతున్నారని కాంగ్రెస్ క్యాడర్ లేదని అనడం హాస్యపదంగా ఉందని అన్నారు. బిజెపి తెరాస కుమ్మక్కై తీసుకొచ్చిన ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని కుని చేయడమే అని అన్నారు. ఈ ఎన్నికలతో బిజెపికి మరియు టిఆర్ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని అన్నారు. pls. subscribe and share ... pls suporte over channel praja jagruthi tv comming soon 24 hours news and entertainment live channel ... pls

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...